Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్భూపాలపల్లి లో ఉద్రిక్తత..

భూపాలపల్లి లో ఉద్రిక్తత..

భూపాలపల్లి లో ఉద్రిక్తత..
సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు..
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని శపథం..

మంజూరు నగర్ వద్ధ బైఠాయింపు..
భారీగా ట్రాఫిక్ జాం..
స్పాట్ వాయిస్ , గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని.. పోలీసులు అడ్డుకున్నారు. స
బృందం పరటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఉదయం నుచే.. గణపురం క్రాస్ నుంచి భారీగా మోహరించారు. ఖమ్మం పర్యటన పూర్తి చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న సీఎల్పీ బృందం సభ్యులు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు సీతక్క , శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు భూపాలపల్లి లోని మంజూరు నగర్ వద్ద అడ్డుకున్నారు. ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదనడంతో. రోడ్డుపై నే బైఠాయించారు. ప్రాజెక్టును సందర్శించకుండా పోయేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. లక్షల కోట్ల పెట్టి నిర్మించిన ప్రాజెక్టులు భారీ వర్షాలు, వరదలతో నీటి మునిగిపోయాయని అన్నారు. ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments