Sunday, June 8, 2025
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో పిడుగుల వర్షం..

భూపాలపల్లి జిల్లాలో పిడుగుల వర్షం..

మల్హర్ మండలంలో విషాదం.
పిడుగుపాటు కి యువ రైతు మృతి
స్పాట్ వాయిస్, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనికి వెళ్లిన యువ రైతును పిడుగు బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని తాడిచెర్ల పంచాయతి పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన కాటం రఘుపతి రెడ్డి(25) అనే యువకుడు మంగళవార తన తల్లిదండ్రుల తో కలిసి వ్యవసాయ పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతునికి తల్లి దండ్రులు ఒక సోదరి కలదు.యువ రైతు మృతి తో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉంటే రేగొండ మండలం పొనగల్లులోనూ రైతు పిడుగు పాటుకు మృతి చెందాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments