Sunday, September 22, 2024
Homeక్రైమ్జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత

స్పాట్ వాయిస్‌, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బాలిక మిస్ అయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులతో పాటు ఊరుఊరంతా కదిలొచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్హర్ మండలం లోని నాచారం గ్రామానికి చెందిన బాలిక కనిపించట్లేదని, అదే గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ మూడు రోజుల క్రితం కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు.  అయితే పోలీసులు పట్టించుకోవడంలేదని బాధిత కుటుంబ సభ్యులు, నాచారం గ్రామస్తులు ఆదివారం రాత్రి కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై మెరుపు ఆందోళన చేపట్టారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు కాటారం ఎస్సై సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని రెండు రోజుల్లో కిడ్నాప్ కేసు ఛేదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. ధర్నాతో కాటారం మంథని మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్​ అయింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments