Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుముగిసిన క్రికెట్ ఛాంపియన్ షిప్ సీజన్ - 2

ముగిసిన క్రికెట్ ఛాంపియన్ షిప్ సీజన్ – 2

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గండ్ర

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణకాలని అంబేద్కర్ స్టేడియంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, యువ నాయకులు గండ్ర హరీష్ రెడ్డి నేతృత్వంలో వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్ ఛాంపియన్ షిప్ సీజన్ – 2 గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, సీనియర్ నాయకులు పైడిపల్లి రమేష్, టీఆర్ఎస్ యూత్, గండ్ర యువసేన జిల్లా నాయకులు కరాటే శ్రీను, మోతె రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments