Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే గండ్రను కలిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు

ఎమ్మెల్యే గండ్రను కలిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డిని (టిపిజెఏ) తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ భూపాలపల్లి కమిటీ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి వినతి పత్రం అందజేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పైన, సంక్షేమ కోసం సహకరించాలని విన్నవించారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టిపిజెఏ జిల్లా అధ్యక్షులు జాలిగం రాజు, ఉపాధ్యక్షులు ఎస్డి.ఇమ్రాన్ హైమద్ , ప్రధాన కార్యదర్శి బండ మోహన్, కోశాధికారి కారుకూరి సతీష్, సహాయక కార్యదర్శి దండుగుల అశోక్, ప్రచార కార్యదర్శి తోట చంద్రశేఖర్, గుర్రం సంపత్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments