Tuesday, June 3, 2025
Homeతెలంగాణ15 శాతం పెరిగిన మద్యం ధరలు 

15 శాతం పెరిగిన మద్యం ధరలు 

15 శాతం పెరిగిన మద్యం ధరలు 

నేటి నుంచే అమల్లోకి…

స్పాట్ వాయిస్, బ్యూరో : రేవంత్ రెడ్డి సర్కార్ మందుబాబులకు గుండెపగిలే వార్త వినిపించింది. ఎండాకాలం ముందు మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బీర్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 15 శాతం పెంచుతూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను ఆపేస్తూ యునైటెడ్ బేవరేజేస్ తీసుకున్న నిర్ణయంతో బీర్ల ధరల పెంపుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా.. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మద్యం ధరల నిర్ణయ కమిటీ.. బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. ఈ మేరకు కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీంతో.. రేవంత్ రెడ్డి సర్కార్.. బీర్ల ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై ఏకంగా 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments