3.1శాతం సర్వేలో పాల్గొనలేదు..
16నుంచి 28 వరకు సర్వే
అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్
వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొన లేదని చెప్పారు. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈ సారి నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సర్వేలో వివరాలు వెల్లడించలేదని మల్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో బీసీల శాతం స్వల్పంగా తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో 51 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరిపిన సర్వేలో బీసీల శాతం దాదాపు 5 శాతానికిపైగా తగ్గడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Recent Comments