Sunday, September 22, 2024
Homeతెలంగాణబాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్.. టెన్షన్

బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్.. టెన్షన్

నాలుగో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
పరామర్శకు బైలెల్లిన బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
అలర్ట్ అయిన పోలీసులు..
కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు
స్పాట్ వాయిస్, డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వరుసగా నాలుగో రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులను అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తాము బయటకు కనిపించకుండా బారికేడ్లు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండో గేట్ వద్ద కూడా భారీగా ‌పోలీసులు మోహరించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఆయా పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. నిజామాబాద్-భైంసా రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments