Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్బండి పాదయాత్ర పై ఉత్కంఠ..

బండి పాదయాత్ర పై ఉత్కంఠ..

బండి పాదయాత్ర పై హై కోర్టు లో లంచ్ మోషన్ పిటీషన్
స్పాట్ వాయిస్‌ , డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. జనగామ జిల్లాలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు మంగళవారం బ్రేక్‌ పడింది. పాదయాత్ర కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలన్న పోలీసుల నోటీసులపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ దాఖలైంది. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. ఇదిలా ఉంటే యాత్ర ఆగిన చోటే మొదలుపెడతానని బండి సంజయ్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments