Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్వైఎస్ షర్మిలకు బెయిల్..

వైఎస్ షర్మిలకు బెయిల్..

షరతులు వర్తిస్తాయన్న కోర్టు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంగళవారం మంజూరు చేసింది. రూ.30 వేలతో పాటుగా ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. పోలీసులపై దాడి కేసులో ఏప్రిల్24 సోమవారం రోజున షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో షర్మిలను హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే దీనిపై షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కొన్ని షరతులను కూడా విధించింది. వీదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి చేసింది. సాయంత్రం షర్మిల జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments