Monday, September 30, 2024
Homeలేటెస్ట్ న్యూస్మళ్లీ లీకైన ´భగీరథ`

మళ్లీ లీకైన ´భగీరథ`

మళ్లీ లీక్ అయిన భగీరథ పైప్ లైన్
నీళ్ల పాలైన ధాన్యం

న్యాయం చేయాలంటున్న రైతు

స్పాట్ వాయిస్ (నర్సంపేట) ఖానాపురం:
ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట శివారులో ఆదివారం రాత్రి భగీరథ పైప్ లైన్ లైక్ అయింది. దీంతో మంగళవారం పేట గ్రామానికి చెందిన రైతు రాగం మల్లేష్ రోడ్డుపైన ఆరబోసిన ఐదు ఎకరాల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. నాలుగు రోజుల క్రితమే ఖానాపూర్ మండలం కేంద్రంలో భగీరథ పైప్ లైన్ లీకై రోడ్డుపైన ఆరబోసిన ఏడు ఎకరాల ధాన్యం నీటిపాలైంది. ఈ ఘటన జరిగి వారం కూడా గడవకముందే మళ్లీ మండలంలో పైప్ లైన్ లీకేజీ ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments