Monday, April 21, 2025
Homeక్రైమ్గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట మండలం మడికొండ చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనగా వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన బత్తిని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఉదయం ఆటోలో పెద్ద పెండ్యాల నుంచి వరంగల్ మార్కెట్ కు టమాటోలు తీసుకెళ్తుండగా మడికొండ చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఆటోను ఢీకొనడంతో ఎదురుగా ఉన్న స్తంభానికి ఆ వ్యక్తి తగిలింది. దీంతో తలకు బలమైన గాయమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments