భూ తగాదా.. తండ్రిని చంపిందనే కోపంతో హత్యాకు యత్నం
స్పాట్ వాయిస్, కాటారం: భూ తగాదాలతో పాటు తన తండ్రిని హత్య చేశారనే కోపంతో ఆవేశానికి గురైన ఓ యువకుడు లక్ష్మి(42) అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లక్ష్మి అదే గ్రామానికి చెందిన మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో నిందితురాలు. కొద్దిరోజుల క్రితమే బెయిల్ పై బయటకు వచ్చింది. లక్ష్మి కాటారం పోలీస్ స్టేషన్ కు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా అక్కడే ఆమె కోసం కాపు కాసిన మారుపాక సారయ్య కొడుకు మారుపాక అంజి ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు. చుట్టూ ఉన్నవారు అడ్డుకోవడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. దేవరాంపల్లి కి చెందిన మారుపాక సారయ్య మారుపాక లక్ష్మి, కుటుంబానికి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకున్న అంజి కాటారం పోలీస్ స్టేషన్ సమీపంలో మహిళపై గొడ్డలితో దాడి చేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గొడ్డలితో మహిళపై యువకుడి దాడి
RELATED ARTICLES
Recent Comments