Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుపేకాటరాయుళ్ల అరెస్ట్

పేకాటరాయుళ్ల అరెస్ట్

రూ.24550 నగదు,6 బైకులు స్వాధీనం
స్పాట్ వాయిస్, గణపురం: మండలంలోని చెల్పూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఎస్సై అభినవ్ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి చెల్పూర్ లో కొందరు పేకాడుతున్నారన్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి ఎస్సై అభినవ్ దాడి చేశారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు వ్యక్తులు పట్టుపడ్డారు. పట్టుబడిన వారిలో వంగ సంపత్, కోల రాజు, దేవనూరి రాజేందర్, కూకట్ల నరేందర్, పోతుల నరసింహారెడ్డి, పిట్టల మహేష్ ఉన్నారు. వారి నుంచి రూ.24550 నగదు, 6 సెల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభినవ్ వెల్లడించారు. పేకాట ఆడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments