Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుసొల్లేటి ఉపేంద్రాచారికి అక్షర పురస్కారం

సొల్లేటి ఉపేంద్రాచారికి అక్షర పురస్కారం

సొల్లేటి ఉపేంద్రాచారికి అక్షర పురస్కారం
స్పాట్ వాయిస్, సూర్యాపేట : సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన సొల్లేటి ఉపేంద్రాచారికి జాతీయస్థాయి అక్షర పురస్కారం లభించింది. సూర్యాపేటలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ , చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఉపేంద్రాచారిని ఘనంగా సన్మానించి మెమెంటో, మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. విద్య, వైద్యం, పర్యావరణం, క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య, నాట్య, కళా, పారిశ్రామిక, సామాజిక, స్వచ్ఛంద సేవా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, విశేష సేవలందించిన నిష్ణాతులైన వారికి అక్షర అవార్డులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉపేంద్రాచారిని న్యూస్ రీడింగ్, సాహిత్యం, నటన, కళా రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నందుకు గాను ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. వినసొంపైన స్వరంతో ప్రభాత సమయాన్నే ప్రాంతీయ వార్తలు అందిస్తూ, అక్షరాల మీద ఉన్న అపార అభిమానంతో, పదాలకు ప్రాణ వాయువును అందిస్తూ కవిగా, రచయితగా, నటుడిగా రాణించడం అభినందనీయమని ప్రశంసించారు. తనకు అక్షర అవార్డు ఇచ్చినందుకు నిర్వాహకులకు ఉపేంద్రాచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments