Tuesday, September 24, 2024
Homeజిల్లా వార్తలుతమ్ముడు అదృశ్యమయ్యాడని అక్క ఫిర్యాదు

తమ్ముడు అదృశ్యమయ్యాడని అక్క ఫిర్యాదు

స్పాట్ వాయిస్, గణపురం: తన తమ్ముడు అదృశ్యమయ్యాడంటూ అక్క ఫిర్యాదు చేయటంతో గణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల కేంద్రానికి చెందిన బానోత్ కిరణ్ (29) అనే వ్యక్తి ఈనెల 7న గణపురం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి గురించి కుటుంబ సభ్యులు గాలించగా కిరణ్ ఆచూకీ లభించలేదు. దీంతో తన తమ్ముడు కనబడటం లేదని కిరణ్ అక్క హాట్కార్ సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఫొటోలోని వ్యక్తి కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై అభినయ్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments