Wednesday, April 9, 2025
Homeక్రైమ్న్యూస్ కవరేజ్ కి వెళ్తున్న జర్నలిస్టులకు ప్రమాదం

న్యూస్ కవరేజ్ కి వెళ్తున్న జర్నలిస్టులకు ప్రమాదం

న్యూస్ కవరేజ్ కి వెళ్తున్న జర్నలిస్టులకు ప్రమాదం

స్పాట్ వాయిస్,నర్సంపేట: నర్సంపేట లోని హాస్టల్ లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం బుధవారం ఉదయం పట్టణంలో వ్యాపించింది. ఈ విషయం తెలియగానే నర్సంపేట పట్టణానికి చెందిన జర్నలిస్టులో వార్త కవరేజ్ కోసం వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. నర్సంపేట ఏబీఎన్ రిపోర్టర్ వేణు, హెచ్ఎంటీవీ రిపోర్టర్ ప్రదీప్ వార్త కవరేజ్ కి వెళ్తున్న సందర్భంలో టాటా ఏసీ వాహనం రివర్స్ వచ్చి జర్నలిస్ట్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. ఈ క్రమంలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ ప్రదీప్ కు పొట్ట భాగంలో బలమైన గాయం కాగా.. ఏబీఎన్ రిపోర్టర్ వేణు తొంటి భాగంలో గాయమైంది. తీవ్ర గాయమైన ప్రదీప్ ను వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తొంటి భాగంలో గాయమైన వేణుకు నర్సంపేట పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments