Sunday, April 20, 2025
Homeక్రైమ్ఆటోను ఢీకొన్న లారీ

ఆటోను ఢీకొన్న లారీ

ఆటోను ఢీకొన్న లారీ..

నలుగురు స్పాట్ డెత్ 

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments