Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుబైక్ పై వెళుతున్న వ్యక్తిపై పడిన చెట్టు

బైక్ పై వెళుతున్న వ్యక్తిపై పడిన చెట్టు

బైక్ పై వెళుతున్న వ్యక్తిపై పడిన చెట్టు కొమ్మ..

అక్కడికక్కడే వ్యక్తి మృతి 

ములుగు జిల్లాలో విషాదం..

స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా జిల్లాలోని ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. జహంగీర్‌ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments