Sunday, June 8, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కూతురు మృతి

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కూతురు మృతి

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కూతురు మృతి

స్పాట్ వాయిస్ , క్రైం: రోడ్డు ప్రమాదం లో కాంగ్రెస్ నాయకుడి కూతురు మృతి చెందింది. ఈ విషాద ఘటన శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కూతురు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తనియాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments