Monday, May 20, 2024
Homeక్రైమ్హోలీ పండుగ పూట విషాదం..

హోలీ పండుగ పూట విషాదం..

హోలీ పండుగ పూట విషాదం..

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు దుర్మరణం

చెల్పూర్ లో ఘటన

స్పాట్ వాయిస్, గణపురం:పండుగపూట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చెసుకుంది… రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం… చిట్యాల మండలం జడలపేట పంచాయతీ పరిధి గాంధీనగర్ గ్రామానికి చెందిన బొట్ల రమేష్ (28) తన ద్విచక్ర వాహనంపై అత్తగారైన వీరయ్యపల్లికి వస్తుండగా అదే సమయంలో ధర్మరావుపేట గ్రామానికి చెందిన మాట్ల ప్రమ్ కుమార్ ఫోటో గ్రాఫర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై చెల్పూర్ కు వెళుతున్న క్రమంలో చెల్పూర్ చర్చి సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొట్ల రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో భూపాలపల్లి ఏరియా దవకానకు తరలించారు. మృతుడు బొట్ల రమేష్ కు భార్య అనూష, కూతురు, కుమారుడు ఉన్నారు. పండంగపూట అత్తారింటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందందడంతో వీరయ్యపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments