Friday, September 20, 2024
Homeక్రైమ్వరంగల్ లో తీవ్ర విషాదం..

వరంగల్ లో తీవ్ర విషాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..
ముగ్గురు మృతి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ఐనవోలు మండలం
బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడిక్కక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments