Saturday, September 21, 2024
Homeక్రైమ్భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం..

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం..

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం..

స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. . ఈవిషాద ఘటన వివారాలు ఇలా ఉన్నాయి. గణపురం మండలం గాంధీ నగర్ కు చెందిన మాదం ఐలయ్య తన భార్య కోమలతో కలిసి జూబ్లీ నగర్ లోని బంధువుల పెళ్లికి వెళ్లారు. శుక్రవారం రాత్రి బరాత్ అనంతరం ఐలయ్య ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జగ్గయ్య పల్లె క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఐలయ్య అక్కడి కక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడం తో.. అతడిని ఎవరూ గుర్తించలేదు. ఉదయం అటు గా వెళ్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments