Saturday, May 24, 2025
Homeలేటెస్ట్ న్యూస్కొండా సురేఖకు యాక్సిడెంట్..

కొండా సురేఖకు యాక్సిడెంట్..

కన్నీరుపెట్టుకున్న కొండా మురళి
రాహుల్ గాంధీ పర్యటనలో అపశృతి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. స్వయంగా స్కూటీ నడిపిన కొండా సురేఖ.. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంది. అయితే ఈ ర్యాలీలో ఆమె నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో కుడి కన్ను పై భాగం, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తగిలిన గాయాలు చూసి కంటతడి పెట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments