Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన ఈవో..

ఏసీబీకి చిక్కిన ఈవో..

 ఆఫీసుతో పాటు ఇంట్లోనూ సోదాలు..
స్పాట్ వాయిస్, కొత్తగూడ: కొత్తగూడ మండలంలోని ముసలమ్మ దేవాలయంలో ఆదివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ఈవోగా పని చేస్తున్న భిక్షమాచారి ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ ప్రకారం ఈవోని పట్టుకున్నారు. రూ. 20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే హన్మకొండలోని ఈవో నివాసంలోనూ దాడులు చేసి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఆలయానికి సంబంధించిన పలు సామగ్రి లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments