Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ

రూ 6వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 

స్పాట్ వాయిస్, క్రైమ్: హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ 6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ 10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. పక్క ప్లాన్ ప్రకారం రూ. 6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏఈ గోపాల్ ప్రస్తుతం గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments