Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్వామ్మో.. సూపరింటెండెంట్ సార్..

వామ్మో.. సూపరింటెండెంట్ సార్..

మున్సిపల్‌ సూపరింటెండెంట్ ఇంటిపై ఏసీబీ దాడి..
ఇంట్లో రూ.2.93 కోట్ల నగదు పట్టివేత..
మొత్తం ఆస్తుల విలువ రూ. 6.07 కోట్లు
స్పాట్ వాయిస్, బ్యూరో:  నిజామాబాద్ మున్సిపల్‌ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌ నివాసంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయట పడ్డాయి. అతడి ఇంట్లో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌ నరేందర్, అతని భార్య, తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments