Monday, April 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన ఐటీడీఏ ఏఈ, డీఈ

ఏసీబీకి చిక్కిన ఐటీడీఏ ఏఈ, డీఈ

అటవీ జిల్లాలో ఏసీబీ దాడులు
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ ఏఈ, డీఈలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఐటీడీఏలో ఇంజినీరింగ్ అధికారులు గా పని చేస్తున్న డీఈ నవీన్, ఏఈ అబిద్ ఖాన్ మేడారం ఆలయ కాంట్రాక్ట్ పనుల చేసి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈక్రమంలో అధికారులిద్దరూ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments