Friday, September 20, 2024
Homeక్రైమ్ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మరో కానిస్టేబుల్
స్టేషన్ బెయిల్ కోసం రూ. 70 వేలు డిమాండ్
విచారణ జరుపుతున్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై వెంకన్న తోపాటు కానిస్టేబుల్ సదానందం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  వివరాలిలా ఉన్నాయి.  పోలీసుల దాడుల్లో గుడుంబా తయారీకి ఉపయోగించే నలబెల్లం రవాణా చేస్తున్న ఓ వక్తి  పట్టుబడ్డారు. అయితే స్టేషన్ బెయిల్ కోసం అతడి నుంచి ఎస్సై రూ. 70 వేలు డిమాండ్ చేశారు. ఈ విషయమై అదే స్టేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సదానందం అనే కానిస్టేబుల్ ద్వారా మంతనాలు జరిపారు. ఈ క్రమంలో వేరే వ్యక్తికి ఫోన్ పే ద్వారా రూ. 20వేల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శుక్రవారం వ్యాపారి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ సాంబయ్య బృందం దాడి చేసి ఎస్సై వెంకన్నతోపాటు కానిస్టేబుల్ సదానందంను పట్టుకున్నారు. ఈ విషయమై ఇంకా స్టేషన్ లోనే ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments