Sunday, May 25, 2025
Homeక్రైమ్ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్

ఆస్పత్రికి తరలిస్తుండగా వ్యక్తి మృతి
స్పాట్ వాయిస్,సంగెం: మండలంలోని తీగరాజుపల్లి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సంగెం ఎస్సై భారత్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.అయితే అతడిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి స్టేషన్ నెక్కొండకు చెందిన కడారి అశోక్ యాదవ్ (48)గా గుర్తించారు. మృతునికి భార్య అనిత, కొడుకు, కూతురు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments