Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలుకడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
స్పాట్ వాయిస్, గణపురం: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పంజల రాజు (42) కొంతకాలంగా కడుపునొప్పి బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కడుపునొప్పి తీవ్రంగా రావడంతో నొప్పి భరించలేక సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనికి వెళ్లి రాజు భార్య రజిత ఇంటికి తిరిగి వచ్చేసరికి లోపల వైపు తలుపు వేసుకొని ఉండడంతో చుట్టుపక్కల వారు బంధువులు వచ్చి తలుపులు తీసి చూడగా ఇంట్లో రాజు ఉరివేసుకొని కనిపించాడు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న ఎస్ఐ మ్యాక అభినవ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments