Saturday, September 21, 2024
Homeక్రైమ్బస్సును ఢీకొన్న లారీ

బస్సును ఢీకొన్న లారీ

మూడు పల్టీలు కొట్టిన బస్సు
43మంది ప్రయాణికులకు గాయాలు..
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం..

స్పాట్ వాయిస్, క్రైం: భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సు 47 మంది ప్రయాణికులతో విజయవాడ బయల్దేరింది. కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఆనందగనికి వద్ద వేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. లారీ ఢీ కొట్టడంతో బస్సు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మొత్తం ప్రయాణికుల్లో 43 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments