Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆవుల సుబ్బారావు అరెస్ట్

ఆవుల సుబ్బారావు అరెస్ట్

బోయిగూడ రైల్వే కోర్టులో హాజరుపర్చున్న పోలీసులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును శుక్రవారం రాష్ర్ట పోలీసులు అరెస్టు చేశారు. వైద్యప‌రీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్షల త‌ర్వాత ఆయ‌న‌ను బోయిగూడ రైల్వే కోర్టులో హాజ‌రుప‌ర్చనున్నారు. మేడిప‌ల్లిలోని సాయి డిఫెన్స్ అకాడ‌మీకి కూడా రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నిర్వాహ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడ‌మీ రికార్డులతో పాటు అన్ని ప‌త్రాల‌ను ఆర్పీఎఫ్ కార్యాల‌యానికి తీసుకురావాల‌ని ఆదేశించారు. ఆర్మీ ఉద్యోగార్థుల‌ను సాయి డిఫెన్స్ అకాడ‌మీ నిర్వాహ‌కుల‌ను రెచ్చగొట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments