Friday, September 20, 2024
Homeతెలంగాణసీఎం కేసీఆర్ కు హైకోర్ట్ నోటీసులు

సీఎం కేసీఆర్ కు హైకోర్ట్ నోటీసులు

స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులపై రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ హైదరాబాద్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడంపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ కలెక్టర్‌ కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments