Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం..

అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం..

అగ్ని పథ్ ఆందోళన లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం..
ఎంజీఎంకు తరలింపు..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో ఘటన
స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్ పూర్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వేస్టేషన్‌ విధ్వంస ఘటనలో తనపై కేసు పెడతారనే భయంతో.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ బలవన్నరణానికి ప్రయత్నించాడు. ఆందోళన సందర్భంగా అతడు ఓ టీవీ చానల్‌లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments