Friday, September 20, 2024
Homeజాతీయంఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

స్పాట్ వాయిస్ , బ్యూరో:  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20 పేర్లపై చర్చించి చివరకు ముర్ము పేరును ఖరారు చేశారు. ఒడిశా మయూర్‌బంజ్ జిల్లాలో జన్మించిన ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఐదేళ్లు పనిచేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఉంటే బాగుంటుందని భావించామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.ద్రౌపది ముర్ముకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments