Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుభూమి కోసం కర్రలతో దాడులు

భూమి కోసం కర్రలతో దాడులు

హన్మకొండలో ఉద్రిక్తత
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. భూమి కోసం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన గుండ్ల సింగారం ప్రాంతంలో చోటు చేసుకుంది.  రెండు నెలలుగా హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ 177 లో ఇటీవల 3వేల మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. కాగా.. మంగళవారం గుడిసెలు వేసుకున్న వారికి.. స్థానికుల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి భారీగా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments