Sunday, April 20, 2025
Homeక్రైమ్అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, గణపురం: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బుద్ధారం బీసీ కాలనీకి చెందిన చింతల శంకర్ (32) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాగా శంకర్ గత సంవత్సరం తన సొంత వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి వస్తుండగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో శంకర్ మెదడులో రక్తం గడ్డకట్టగా పక్షవాతానికి గురై చికిత్స పొందుతున్నాడు. అప్పటి నుంచి అతని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేశారు. అయినా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో అప్పులు కాగా తీర్చలేనని మనస్తాపానికి గురైన శంకర్ శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి రాజయ్య ఫిర్యాదు ఎస్సై అభినవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments