Monday, September 23, 2024
Homeక్రైమ్కాల్పుల్లో వరంగల్ వాసి మృతి

కాల్పుల్లో వరంగల్ వాసి మృతి

స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం): సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్రవారం జరిగిన ఆందోళనను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన యువ‌కుడు మృతిచెందాడు.  మృతుడు ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు స్థానిక పోలీసులకు రైల్వే అధికారులు స‌మాచార‌ం ఇచ్చారు. త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ స్కీంను నిర‌సిస్తూ కొంత‌మంది యువ‌కులు సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఆందోళ‌న‌కు దిగిన విషయం తెలిసింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments