Sunday, September 22, 2024
Homeతెలంగాణమేం పెంచాం.. మీరూ పెంచండి

మేం పెంచాం.. మీరూ పెంచండి

స్పాట్ వాయిస్, డెస్క్: రాష్ర్టంలో ఇటీవల ఆర్టీసీ బస్‌ చార్జీలను పెంచడంతో ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే సంస్థలకు టీఎస్‌ ఆర్టీసీ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం.. ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు చార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు సర్క్యులర్లను పంపించినట్టు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల ఛార్జీలు పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి నడిపించే బస్సు చార్జీల్లో చాలా వ్యత్యాసం ఉంది. టికెట్‌ ధర తక్కువ ఉండటంతో ప్రయాణికులు ఇతర రాష్ట్రాల బస్సులను ఆశ్రయిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ దృష్టికి వచ్చింది. దీంతో సర్క్యులర్‌ పంపించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి సైతం సర్క్యూలర్‌ పంపించారు. ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్టు సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments