Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలురామాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి

రామాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి

హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ సంపత్ రెడ్డి
చెల్పూర్ రామాలయ నిర్మాణానికి రూ. లక్ష 11వేల విరాళం

స్పాట్ వాయిస్, గణపురం: రామాలయ నిర్మాణం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ పబ్బత్ రెడ్డి సంపత్ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న రామమందిరానికి విరాళాల సేకరణలో భాగంగా సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆదివారం హైదరాబాద్ లోని సంపత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు సంపత్ రెడ్డి తన వంతు సహకారంగా రూ. 1.11లక్షలను విరాళం ప్రకటించినట్లు సర్పంచ్ తెలిపారు. రామమందిరం నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్పవిషయమయన్నారు. జిల్లాలోనే అద్భుతంగా చెల్పూర్ రామాలయం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో రామాలయాన్ని నిర్మిస్తున్నామని మీ సహకారం కావాలని సంపత్ రెడ్డి కోరడంతో తక్షణం ఆయన రూ. రూ. లక్ష 11వేలను విరాళాన్ని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. చెల్పూర్ రామాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు. రాముడి మార్గం అందరికీ అనుసరణీయమని… తనతో పాటు ఉండే వివిధ వర్గాలకు చెందిన వారు సైతం రామాలయం కోసం ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి సంపత్, పిన్నింటి హనుమంతరావు, శ్రీనివాసరావు, మాధవరావు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments