Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుమృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: వనమాల కనిపర్తి గ్రామ మృతుల కుటుంబాలకు రూ. పదివేల చొప్పున 70 కుటుంబాలకు సుమారు 7 లక్షల రూపాయలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం ఐనవోలు మండలం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వనమాల కనిపర్తి గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టసుఖాల్లో తాను ఎప్పుడు ముందుంటానని, వనమాల కనిపర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు జయపాల్,నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments