Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుఎస్సై రవీందర్ కు ఉత్తమ సేవా పతకం

ఎస్సై రవీందర్ కు ఉత్తమ సేవా పతకం

ఎస్సై రవీందర్ కు ఉత్తమ సేవా పతకం

స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట పట్టణ సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బొజ్జా రవీందర్ ఉత్తమ సేవ పతకానికి ఎంపికయ్యారు. 2022 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవ పతకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన 15 మంది అధికారులు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న బొజ్జ రవీందర్ ఉత్తమ సేవ పతకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ కు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments