Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుషాపు యజమాని నిజాయితీ

షాపు యజమాని నిజాయితీ

పోగొట్టుకున్న డబ్బులను బాధితుడికి అందజేసిన మధుకర్ రావు
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపూర్): తన షాపు వద్ద దొరికిన డబ్బులను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి నిజాయతీని చాటుకున్నాడు ఓ కూల్ డ్రింక్ షాప్ యజమాని. వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన ఉడుగుల కుమారస్వామి శనివారం రాత్రి బుధరావుపేటలోని గీత ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ షాప్ కి వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ కొనుగోలు చేశాడు. షాప్ యజమానికి డబ్బులు చెల్లించే క్రమంలో రూ.19,500 జేబులో పెట్టుకోబోగా కిందపోయాయి. డబ్బులను గమనించకుండా కుమారస్వామి అలాగే వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తరువాత డబ్బులను గమనించిన యజమాని మల్యాల మధుకర్ రావు తన షాప్ లో గల సీసీ కెమెరాలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించాడు. వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి ఆదివారం ఉదయం కుమారస్వామికి డబ్బులను అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. ఈ సందర్భంగా మధుకర్ రావుకు బాధితుడు కుమారస్వామి కృతజ్ఞతలు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments