Friday, September 20, 2024
Homeక్రైమ్తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులు దూరం..

తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులు దూరం..

రోడ్డు ప్రమాదంలో
బీటెక్ విద్యార్థి మృతి
– ధర్మారావుపేటలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గణపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి జాలిగిపు శ్రీకాంత్ (21) శనివారం బంధువుల ట్రాక్టర్ రిపేరు నిమిత్తం తన పల్సర్ బైక్ పై చెల్పూర్ గ్రామానికి వెళ్ళాడు.
రాత్రి స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో చెల్పూర్ శివారు, గొల్లపల్లి రోడ్డులోని మర్రిచెట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడంతో ఏదైనా వాహనం ఢీ కొట్టిందా..? లేక బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది.. శ్రీకాంత్ మృతితో ధర్మారావుపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి అన్న గణేష్ తొమ్మిది నెలల క్రితం ఉరి వేసుకొని చనిపోయాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు కుమారులను కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.. కాగా
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments