Saturday, April 19, 2025
Homeక్రైమ్పిస్తోలుతో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య

పిస్తోలుతో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య

పిస్తోలుతో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య

స్పాట్ వాయిస్ నర్సంపేట (దుగ్గొండి): మండలానికి చెందిన ఆర్మీ జవాను పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం మర్రిపల్లికి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాజయ్య, కొమురమ్మ దంపతుల కుమారుడైన రాములు(32) పదేళ్ల క్రితం సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌)లో చేరారు. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం డ్యూటీలో ఉన్న రాములు పిస్తోలుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల క్రితం ఆయన సొంతూరుకు వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను పంజాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాములు ఆత్మహత్యకు పాల్పడినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహం శనివారం బేగంపేట విమానాశ్రయానికి రానున్నట్లు సమాచారం. రాములు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. రాములు కు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments