Saturday, September 21, 2024
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో చోరీ కలకలం

భూపాలపల్లి జిల్లాలో చోరీ కలకలం

ఓ ఇంట్లో దొంగతనం, నగదు అపహరణ
స్పాట్ వాయిన్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ పాషా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. బంధువులతో కలిసి గురువారం ఉదయం హన్మకొండలో ఓ వివాహనికి వెళ్లారు. శుక్రవారం ఉదయం పాలవాడు పాలు పట్టుకొస్తాడని ఇంటికి వెళ్లి తీసుకోవాలని తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. అతను ఉదయం పాషా ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడంతో ఆందోళనకు గురైన ఆయన ఇంట్లోకి వెళ్లి చూశాడు.  బీరువా పగలకొట్టి, సామగ్రి చెల్లా చెదురుగా పడి ఉండడం గమనించాడు. వెంటనే హనుమకొండలో ఉన్న పాషాకు దొంగతనం జరిగిందన్న సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న పాషా ఇంట్లో బీరువాను పరిశీలించగా నగదు చోరీ అయినట్లు నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై అభినవ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం భూపాలపల్లి నుంచి క్లూస్ టీంను రప్పించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments