Saturday, September 21, 2024
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపూర్): రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఖానాపూర్ మండలంలో జరిగింది. ఖానాపూర్ మండలం మంగళవారిపేటలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఖానాపూర్ మండలం రామ్ నాయక్ తండా లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న డి.ఈర్యా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా
చికిత్స పొందుతూ మరణించాడు. నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామ లక్ష్మి తండాకి చెందిన డి.ఈర్యా వృత్తి రీత్యా నర్సంపేటలో స్థిరపడ్డాడు. బుధవారం హునుమాన్ మాల విరమణ చేశాడు. గురువారం ఖానాపూర్ మండలం వేపచెట్టు తండా శివారు రేవ్ తండాకు చెందిన ఓ బంధువు మాల విరమణ కార్యక్రమానికి హాజరయ్యాడు. నర్సంపేటకు తిరిగి వెళుతుండగా మంగళవారి పేట వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ ని వెనుక నిండి ఢీ కొట్టాడు. దీనితో తీవ్ర గాయాలైన ఈర్యా ని పోలీసులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బాధితునికి భార్య కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసం నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments