Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుమృతుడి కుటుంబానికి సిరికొండ పరామర్శ

మృతుడి కుటుంబానికి సిరికొండ పరామర్శ

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మాదం ఐలయ్య(45) మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హుటాహుటిన పరకాలకు చేరుకొని మార్చురీలో ఐలయ్య మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. ప్రమాద కారణాలను తెలుసుకొని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఐలయ్య మరణం బాధాకరమని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. సిరికొండ వెంట రేగొండ ఎంపీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీ సదానందం, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గోపు బిక్షపతి, టిఆర్ఎస్ నాయకులు రత్నం రవి, వెంపటి అశోక్, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments