Friday, May 23, 2025
Homeజిల్లా వార్తలునమ్మి వచ్చిన వారిని కాపాడుకుంటా

నమ్మి వచ్చిన వారిని కాపాడుకుంటా

ఎమ్మెల్యే అరూరి రమేశ్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామం నుంచి కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన సుమారు 50 నాయకులు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ..ఈ చేరికలు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments